ASBL NSL Infratech

గూగుల్ పేలో ఇకపై.. వసూలు

గూగుల్ పేలో ఇకపై.. వసూలు

ప్రముఖ నగదు చెల్లింపు వేదిక గూగుల్‌ పేలో ఇకపై మొబైల్‌ ఫోన్‌ రీఛార్జ్‌లపై ఫీజును వసూలు చేయనుంది. రీఛార్జి మొత్తం బట్టి కన్వీనియన్స్‌ ఫీజు ఆధారపడి ఉంటుందని సమాచారం. ఇటీవల ఓ వినియోగదారుడు రూ.740 ప్లాన్‌ను రీఛార్జ్‌ చేయగా రూ.3 కన్వీనియన్స్‌ ఫీజును వసూలు చేయగా, తను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో విషయం బయటికి వచ్చింది. ప్రస్తుతానికి కొందరు వినియోగదారుల నుంచి మాత్రమే ఈ తరహా వసూలు చేస్తుండగా, భవిష్యత్‌లో యూజర్లందరీ నుంచి ఈ ఫీజు వసూలు చేసే అవకావం ఉందని తెలుస్తోంది. దీనిపై గూగుల్‌ పే అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఫోన్‌ పే, పేటియం వేదికలు కన్వీనెన్స్‌ ఫీజును వసూలు చేస్తున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :