గూగుల్ పేలో ఇకపై.. వసూలు
ప్రముఖ నగదు చెల్లింపు వేదిక గూగుల్ పేలో ఇకపై మొబైల్ ఫోన్ రీఛార్జ్లపై ఫీజును వసూలు చేయనుంది. రీఛార్జి మొత్తం బట్టి కన్వీనియన్స్ ఫీజు ఆధారపడి ఉంటుందని సమాచారం. ఇటీవల ఓ వినియోగదారుడు రూ.740 ప్లాన్ను రీఛార్జ్ చేయగా రూ.3 కన్వీనియన్స్ ఫీజును వసూలు చేయగా, తను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం బయటికి వచ్చింది. ప్రస్తుతానికి కొందరు వినియోగదారుల నుంచి మాత్రమే ఈ తరహా వసూలు చేస్తుండగా, భవిష్యత్లో యూజర్లందరీ నుంచి ఈ ఫీజు వసూలు చేసే అవకావం ఉందని తెలుస్తోంది. దీనిపై గూగుల్ పే అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఫోన్ పే, పేటియం వేదికలు కన్వీనెన్స్ ఫీజును వసూలు చేస్తున్నాయి.
Tags :