అయోధ్య రాముడికి అత్తారింటి కానుకలు
ఇతిహాసాల ప్రకారం సీతమ్మవారి పుట్టినిల్లు అయిన మిథిలా నగరం నుంచి అయోధ్య రాముడికి పంపేందుకు కానుకలు సిద్ధమవుతున్నాయి. ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో నిర్మాణం పూర్తిచేసుకొంటున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు బిహార్లోని మిథిలా నుంచి పాగ్ (తలపై ధరించే పగిడీలు), పాన్ (తాంబూలం), మఖనా (తామర గింజలు) పంపేందుకు పట్నా మహావీర్ మందిర్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి ఈ మందిరం తరపున రూ.10 కోట్ల విరాళం కూడా ఇచ్చారు. నాణ్యమైన పాన్, మఖనాకు మిథిలా ప్రసిద్ధి. శ్రీరాముడు మిథిలా అల్లుడు. ప్రాణ ప్రతిష్ఠ వేళ ఈ కానుకలు పంపడం ద్వారా మా ప్రాంతాన్ని మేం గౌరవించుకొన్నట్లే అని పట్నా మహావీర్ మందిర్ కార్యదర్శి కిశోర్ కునాల్ తెలిపారు.
Tags :