ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అయోధ్య రాముడికి అత్తారింటి కానుకలు

అయోధ్య రాముడికి అత్తారింటి కానుకలు

ఇతిహాసాల ప్రకారం సీతమ్మవారి పుట్టినిల్లు అయిన మిథిలా నగరం నుంచి అయోధ్య రాముడికి పంపేందుకు కానుకలు సిద్ధమవుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణం పూర్తిచేసుకొంటున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు బిహార్‌లోని మిథిలా నుంచి పాగ్‌ (తలపై ధరించే పగిడీలు), పాన్‌ (తాంబూలం), మఖనా (తామర గింజలు) పంపేందుకు పట్నా మహావీర్‌ మందిర్‌ అధికారులు  ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి ఈ మందిరం తరపున రూ.10 కోట్ల విరాళం కూడా ఇచ్చారు. నాణ్యమైన పాన్‌, మఖనాకు మిథిలా ప్రసిద్ధి. శ్రీరాముడు మిథిలా అల్లుడు. ప్రాణ ప్రతిష్ఠ వేళ ఈ కానుకలు పంపడం ద్వారా మా ప్రాంతాన్ని మేం గౌరవించుకొన్నట్లే అని పట్నా మహావీర్‌ మందిర్‌ కార్యదర్శి కిశోర్‌ కునాల్‌ తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :