బీజేపీలోకి మళ్లీ గాలి
మైనింగ్ వ్యాపారి, కర్ణాటక రాజ్యప్రగతి పక్ష (కేఆర్పీపీ) పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి మళ్లీ కాషాయ పార్టీలోకి చేరబోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. బళ్లారిలో బీజేపీ లోక్సభ అభ్యర్థి బి.శ్రీరాములుకు మద్దతు తెలిపారు. బీఎస్ యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జనార్దనరెడ్డి, ఆ తర్వాత మైనింగ్ కుంభకోణం కేసులో జైలు పాలయ్యారు. కేఆర్పీపీని సొంతంగా ఏర్పాటు చేసి, 2023 ఎన్నికల్లో పోటీ చేశారు.
Tags :