ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

విమాన ప్రయాణికులకు తప్పనిసరి... డీజీసీఏ ఆదేశాలు

విమాన ప్రయాణికులకు తప్పనిసరి... డీజీసీఏ ఆదేశాలు

కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్‌ తప్పనిసరి చేస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్‌ లేని ప్రయాణికులను బోర్డింగ్‌కు ముందే ఆపాలని ఆదేశించింది. ప్రయాణ సమయమంతా మాస్క్‌ ధరించి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మాస్క్‌ లేకుంటే ఎయిర్‌పోర్టులోకి ఆనుమతించొద్దని సూచించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ సీఐఎస్‌ఎఫ్‌కు తాజాగా మార్గదర్శకాలు పంపింది. కొవిడ్‌ భద్రతా చర్యలను పాటించేందుకు నిరాకరించే విమాన ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవలే ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం ముగియలేదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకు కోర్టు ఆదేశించింది. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేదా డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం చర్య తీసుకోవాలిని ఆదేశించిన విషయం తెలిసిందే.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :