ASBL NSL Infratech

ప్రధాని మోదీతో మస్క్ భేటీ ఖరారు!

ప్రధాని మోదీతో మస్క్ భేటీ ఖరారు!

ఈ నెల 21న భారత్‌కు రానున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఆ మరుసటి రోజున (22) ప్రధాని మోదీతో భేటీ కానున్నారని సీనియర్‌ ప్రభుత్వధికారి ఒకరు తెలిపారు. అనంతరం తన విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా భారత ప్రవేశంపై మస్క్‌ అధికారిక ప్రకటన చేయవచ్చన్నారు. అయితే, టెస్లా ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నదన్న విషయంపై స్పష్టత రాకపోవచ్చన్నారు. ఎందుకంటే, ఈ  విషయాన్ని ప్రకటించేందుకు టెస్లా బోర్డు అనుమతి అవసరం. ఇది ఇప్పటికిప్పుడే సాధ్యపడకపోవచ్చని సీనియర్‌ అధికారి పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :