ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వయనాడ్ ఉప ఎన్నికపై స్పందించిన ఈసీ

వయనాడ్ ఉప ఎన్నికపై స్పందించిన ఈసీ

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో వయనాడ్‌ లోక్‌సభ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికకు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో  పాటు షెడ్యూల్‌ ప్రకటిస్తారనే ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి  ఉప ఎన్నిక ప్రకటనకు తొందరేముందని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. పరువు నష్టం దావా కేసులో జైలు శిక్ష పడ్డ రాహుల్‌ గాంధీకి కోర్టు ఆ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు 30 రోజుల గడువు ఇచ్చిందన్నారు. కోర్టు  తీర్పు తర్వాతే  ఏ నిర్ణయమన్నది ప్రకటిస్తామని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ప్రజాప్రతినిధుల చట్టం 1951 ప్రకారం ఖాళీ ఏర్పడిన ఆరు నెలల లోపు బైపోల్స్‌ నిర్వహించుకోవచ్చు అని అన్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :