వయనాడ్ ఉప ఎన్నికపై స్పందించిన ఈసీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో వయనాడ్ లోక్సభ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికకు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటు షెడ్యూల్ ప్రకటిస్తారనే ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వయనాడ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక ప్రకటనకు తొందరేముందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. పరువు నష్టం దావా కేసులో జైలు శిక్ష పడ్డ రాహుల్ గాంధీకి కోర్టు ఆ తీర్పుపై అప్పీల్కు వెళ్లేందుకు 30 రోజుల గడువు ఇచ్చిందన్నారు. కోర్టు తీర్పు తర్వాతే ఏ నిర్ణయమన్నది ప్రకటిస్తామని రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధుల చట్టం 1951 ప్రకారం ఖాళీ ఏర్పడిన ఆరు నెలల లోపు బైపోల్స్ నిర్వహించుకోవచ్చు అని అన్నారు.
Tags :