నటుడు ప్రకాశ్ రాజ్ కు ఈడీ షాక్
తిరుచ్చిలోని ప్రణవ్ జులెలర్స్ సంస్థ మనీలాండరింగ్ కేసులో ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. రూ.100 కోట్ల మనీలాండరింగ్, అక్రమాల కేసు వ్యవహారంలో వచ్చే నెల మొదటివారంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సినీ ప్రముఖుల భాగస్వామ్యంతో నడుస్తున్న ప్రణవ్ జువెలర్స్ సంస్థకు చెందిన తిరుచ్చి, పుదుచ్చేరి శాఖల్లో ఈ నెల 20న ఈడీ అధికారులు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు లెక్కల్లోకి రాని రూ.23.70 లక్షల నగదు, 11.60 కిలోల అక్రమ బంగారాన్ని గుర్తించారు. ఈ సంస్థకు ప్రకాశ్రాజ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. దీంతో ప్రణవ్ జువెలర్స్ నుంచి ఆయన అందుకున్న చెల్లింపుల వివరాలను తెలుసుకునేందుకే సమన్లు పంపినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
Tags :