శామీర్పేటలో సీఎం హెలిప్యాడ్ ప్రాంతంలో డ్రోన్ కలకలం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరగబోయే లోక్ సభ ఎన్నికల కోసం జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ఈరోజు ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరి లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హెలిపాడ్ ప్రాంతంలో డ్రోన్ కలకలం సృష్టించింది. సాయంత్రం మల్కాజ్గిరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొనే సమయంలో శామీర్పేటలో సీఎం హెలిప్యాడ్ వద్ద ఓ వ్యక్తి డ్రోన్ ని ఎగరవేసి అందరినీ కాసేపు టెన్షన్ కి గురి చేశాడు. ఆ తర్వాత అప్రమత్తమైన పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు.
Tags :