జాతిరత్నాలు డైరెక్టర్తో రవితేజ.. సూపర్ కాంబో
హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే రవితేజ దసరా, వాల్తేరు వీరయ్య లాంటి మంచి విజయాల తర్వాత రీసెంట్గా రావణాసురతో పరాజయాన్ని పొందాడు. రవితేజ నటనకు మంచి పేరొచ్చినా, సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసిందేమీ లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది. దాన్నుంచి బయటకు వచ్చి రవితేజ తను చేస్తున్న సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు కూడా.
ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ అనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవి కాకుండా ఇప్పుడు రవితేజ మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేసిన రవితేజ, ఇప్పుడు ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ అనుదీప్ తో రవితేజ జట్టుకట్టబోతున్నాడట.
జాతిరత్నాలు సినిమాతో మంచి విజయం అందుకున్న అనుదీప్, తర్వాత ప్రిన్స్ తో నిరాశ పరిచనప్పటికీ రవితేజ అతన్ని నమ్మి తనకు సినిమా ఇచ్చాడు. అయితే ప్రిన్స్ సినిమా పోయినా అనుదీప్ మీద అందరికీ చాలా నమ్మకముంది. తన కామెడీ టైమింగ్ రవితేజకు బాగా సెట్టవుతుందని అందుకే రవితేజ కూడా అతనికి ఛాన్స్ ఇచ్చాడని టాక్. ఈ సినిమాలో హీరోయిన్లుగా తమన్నా, త్రిష పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ కానుంది.