కేజ్రీవాల్, కవితకు షాక్...జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగింది. ఈ కేసులో ఇద్దరికీ మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 7న ఈ నేతలిద్దరినీ కోర్టు ఎదుట హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. 2021-22 నాటి ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ గత నెలలో ఈడీ అధికారులు, కవిత, కేజ్రీవాల్ను వేర్వేరు తేదీల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత వీరిద్దరూ తిహాడ్ జైలులోనే ఉంటున్నారు. మరోవైపు ఇటీవల సీబీఐ కవితను తన కస్టడీకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే.
Tags :