ఏపీలో కరోనా కల్లోలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఒక్కరోజే 7 వేలకు చేరువలో కొవిడ్ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 38,055 నమూనాలు పరీక్షించగా, కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖ పట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, నెల్లూరులో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 1,066 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36,108 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఒక్క రోజులో 1,535 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,17,384 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్తో 14,514 మంది మరణించారు. కరోనాతో 20,66,762 మంది రికవరీ అయ్యారు.
Tags :