మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు ..ప్రధాని పదవిపై
ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారం కోసం పాకులాడటం లేదని, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకు తామంతా కలిశామని పేర్కొన్నారు. కాంగ్రెస్కు అధికారం లేదా ప్రధాని పదవిపై ఆసక్తి లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే చెన్నైలో స్టాలిన్ బర్త్డే సందర్భంగా చెప్పాను. ఆ వ్యాఖ్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం ఈ భేటీలో 26 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. బీజేపీ స్వయంగా 303 స్థానాల్లో గెలుపొందలేదు. అధికారంలోకి వచ్చేందుకు మిత్రపక్షాల ఓట్లను ఉపjెగించుకున్న కాషాయ పార్టీ ఆ తర్వాత వారిని విస్మరించింది అని ఖర్గే మండిపడ్డారు.
Tags :