ASBL NSL Infratech

మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. కనీసం డిపాజిటును కూడా దక్కించుకోలేకపోయింది. 15 రౌండ్లలో ఏ ఒక్క రౌండ్లోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం  ప్రదర్శించలేదు. మొదటి నుంచి చివరి రౌండ్‌ వరకు మూడో స్థానంలో ఉండిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి కౌంటింగ్‌ కేంద్రం నుంచి ఉదయం 10 గంటల సమయంలోనే వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత కౌంటింగ్‌ వైపు కాంగ్రెస్‌ కార్యకర్తలు కన్నెత్తి కూడా చూడలేదు. డిపాజిట్‌ కూడా కోల్పోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

మునుగోడు ఉప ఎన్నికలో 2,41,805 ఓట్లకు గానూ మొత్తం 2,25,192 కోట్లు పోలయ్యాయి. పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6 వంతు వస్తే డిపాజిట్‌ దక్కినట్లుగా ప్రకటిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్‌ కోల్పోయినట్లు. పాల్వాయి స్రవంతి డిపాజిట్‌ దక్కించుకోవాలంటే 37,532 ఓట్లు రావాలి. కానీ అన్ని ఓట్లు రాలేదు. కేవలం 21 వేల పైచిలుక ఓట్లే స్రవంతికి పోలయ్యాయి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :