ASBL NSL Infratech

మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఆనాటి రోజులు.. పునరావృతం : సీఎం రేవంత్

మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఆనాటి రోజులు.. పునరావృతం : సీఎం రేవంత్

సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ గెలవబోతోందని, కేంద్రంలోనూ తమ ప్రభుత్వమే రాబోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ ఆనాడు దతాత్రేయని ఓడిరచి అంజన్‌ కుమార్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌లో మూడు రంగుల జెండా ఎగురవేశారు. అప్పుడు కేంద్రంలో సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి దానం నాగేందర్‌ 3 రంగుల జెండా ఎగరేయబోతున్నారు. దానం గెలిచి కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యత నిర్వహించబోతున్నారు. బీజేపీ నాయకులు గెలిచి కేంద్ర మంత్రులు అయినా హైదరాబాద్‌కు చేసిందేమిటి? వరదలు వచ్చి హైదరాబాద్‌, అతలాకుతలమైతే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి నగరానికి చిల్లిగవ్వ తేలేదు. జంట నగరాల్లో మెట్రో రైలు రావడానికి కాంగ్రెస్సే కారణం అని అన్నారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు మంచోడే కానీ, కేసీఆర్‌ను నమ్ముకంటే ఆయన మునిగినట్టే. అతని పరువు తీయడానికే సికింద్రాబాద్‌ అభ్యర్థిగా నిలబెట్టారు. పద్మారావు నామినేషన్‌కు కేటీఆర్‌, కేసీఆర్‌ ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. ఆయనకు వాళ్ల మద్దతు ఇవ్వడం లేదు. సికింద్రాబాద్‌ టికెట్‌ను బీజేపీకి తాకట్టు పెట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం చేసే బాధ్యత మాది. నగరానికి కృష్ణా, గోదావరి జలాలు తెచ్చింది ఎవరో చర్చ పెడదాం. ఇందుకు కేటీఆర్‌ సిద్ధమా? బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దే. మత సామరస్యాన్ని కాపాడిరది మా పార్టీ. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడిని ప్రధాని మోదీ బజారులోకి తీసుకొచ్చారు. మత చిచ్చుపెట్టి ఎన్నికల్లో నెగ్గాలని బీజేపీ చూస్తోంది అని విమర్శించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :