ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్ పైనే : సీఎం రేవంత్

తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్ పైనే : సీఎం రేవంత్

తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌పైనే ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. కొండగల్‌లోని తన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందరద్భంగా రేవంత్‌ మాట్లాడుతూ నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌కు 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఎన్నికలు వస్తే సెలవులొస్తాయి. తీర్థయాత్రలకు వెళ్దామని కొందరు అనుకుంటారు. ఓటు చాలా విలువైనది. ఎన్ని కార్యక్రమాలున్నా ఓటు వేసేందుకు కొడంగల్‌కు వచ్చాను. కార్యకర్తలను కలవాలని వచ్చాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు నా వెంట ఉన్నారు. ప్రచారానికి రాకున్నా గెలిపించారు. ఇక్కడికి సిమెంట్‌ పరిశ్రమ రాబోతోంది. పరిశ్రమలు వస్తే భూముల ధరలు పెరుగుతాయి. ఫార్మా కంపెనీలు వస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది. ఏప్రిల్‌ 6న జరిగే తుక్కుగూడ కాంగ్రెస్‌ బహిరంగ సభకు  కొడంగల్‌ నుంచి 25 వేల మంది తరలిరావాలి. ఈ సభలో రాహుల్‌ గాంధీ పాల్గొంటారు. 5గ్యారంటీలు ప్రకటిస్తారు అని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :