ASBL NSL Infratech

ప్రధానిని జైలుకు పంపుతామన్న లాలూ కుమార్తె.. బీజేపీ ఫైర్

ప్రధానిని జైలుకు పంపుతామన్న లాలూ కుమార్తె.. బీజేపీ ఫైర్

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, పాటలీపుత్ర లోక్‌సభ అభ్యర్థి మిసా భారతి.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల మద్దతుతో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే ప్రధాని నరేంద్ర మోదీ జైలుకెళ్లడం ఖాయమని, ఆయనతో పాటు బీజేపీకి చెందిన బడా నేతలు కూడా లాకప్‌లో ఉంటారని భారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక మిసా భారతి వ్యాఖ్యలను బీజేపీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా తీవ్రంగా ఖండించారు. ప్యూన్‌ క్వార్టర్స్‌లో నివసించే వారు ఇంత భారీ ఆస్తికి ఎలా యజమానులు అయ్యారో చెప్పాలని, ఎవరు జైల్లో ఉంటారో.. ఎన్నికల తర్వాత తేలిపోతుందని, అన్నింటికీ లెక్కలు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కాగా.. మానేర్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన మిసా భారతి.. ప్రధాని తమపై, తమ కుటుంబంపై కుటుంబ పార్టీ అంటూ ఆరోపణలు చేస్తున్నారని, అవినీతి పరుల కుటుంబం అంటూ విమర్శిస్తున్నారని, అయితే ఈ దేశంలో అతిపెద్ద అవినీతి పరులు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలేనని అన్నారు. ‘‘రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు కనీస మద్దతు ధర అందిస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ హామీలు ఏమయ్యాయి..? దేశంలో అతిపెద్ద అవినీతి చేసింది వాళ్లు. ఎలెక్టోరల్ బాండ్‌ పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంది వాళ్లు. ఒక్కసారి ప్రజలు ఇండియా కూటమిని గెలిపిస్తే ప్రధాని మోదీతో పాటు అనేకమంది బీజేపీ నేతలు జైల్లో ఉంటారు’’ అంటూ మిసా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మిసా భారతి వ్యాఖ్యలపై స్పందించిన విజయ్ కుమార్ సిన్హా.. ‘‘భయం వల్ల వాళ్లు ఇలా మాట్లాడుతున్నారు.  ఒకప్పుడు ప్యూన్ క్వార్టర్స్‌లో ఉండే వీళ్లు.. ఇప్పుడు పెద్ద పెద్ద రాజభవనాల్లో ఎలా నివసిస్తున్నారు..? దీనికి కచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఎవరు జైలుకెళతారో, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎన్నికల తర్వాత అందరికీ తెలిసిపోతుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :