ఈ విషయంపై ఎవరు చర్చకు వచ్చిన .. నేను సిద్ధంగా ఉన్నా
తొమ్మిదేళ్లలో నవభారత్ ఆవిష్కృతమైందని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. విజయవాడలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో కలిసి మోదీ పాలనపై కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఏపీ విభజన చట్టంలోని అనేక అంశాలను మోదీ అమలు చేశారు. రాష్ట్రానికి ఎయిమ్స్, విద్యా సంస్థలు, జాతీయ రహదారులు ఇచ్చారు. రాష్ట్రంలో అసమర్థ పాలన వల్ల పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగలేదు. ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కూడా ఇవ్వట్లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా జగన్ నాశనం చేశారు. మోదీ నిధులిచ్చినా 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రగతిని ఆపేశారు. పొత్తులపై మా పార్టీ అధిష్ఠానంతో పవన్ కల్యాణ్ చర్చలు జరిపారు. బీజేపీ-జనసేన పార్టీలు పొత్తుతోనే ముందుకు సాగుతున్నాయి. అధిష్ఠానం ఏం చెబితే మేం అలాగే ముందుకెళ్తాం. ఈశాన్య రాష్ట్రాలో పోల్చితే ఏపీకి కేంద్రం ఎక్కువ సాయం చేసింది. ఈ విషయపై ఎవరు చర్చకు వచ్చిన నేను సిద్ధంగా ఉన్నా అని అన్నారు.