మిసిసిపీలో ఎమర్జెన్సీ ప్రకటించిన జో బైడెన్
మిసిసిపి డెల్టాను తాకిన భీకరమైన టోర్నడో, తుపాను వర్షాలతో ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. జరిగిన నష్టాన్ని హృదయ విదారకంగా ఆయన అభివర్ణించారు. తీవ్ర గాలులు, కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన కరోల్, హమ్ఫ్రేస్, మన్రో, షార్కీ కౌంటీలకు సమాఖ్య నిధులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. తుపాను మరణాల సంఖ్య 26కు చేరగా డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు చర్యలు ముమ్మరం చేశాయి. వందల సంఖ్యలో జనం ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారు. బాధితులకు తాత్కాలిక నివాసాలు, ఇళ్ల మరమ్మతులు, వ్యాపారాల పునరుద్ధరణకు సాయం వంటి చర్యలను సమాఖ్య నిధులతో చేపట్టవచ్చని శ్వేతసౌధం నుంచి ఒక అధికారి పేర్కొన్నారు.
Tags :