సునీత తన తండ్రి వివేకాకు చివరి రోజుల్లో నరకం చూపించింది.. అవినాష్ రెడ్డి
దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, వివేకానంద రెడ్డి హత్య కేసు విషయం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారుతుంది. రీసెంట్ గా ఆయన కూతురు సునీత తండ్రి చావుకు సంబంధించి పిపిటి ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో ఎన్నో విషయాలు గురించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మరోపక్క షర్మిల కూడా వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు అంటూ ఆరోపిస్తూ కడపలో ప్రచారం సాగిస్తున్నారు. హంతకులను కాపాడుతున్న ప్రభుత్వం అంటూ జగన్ పై నిందలు మోపుతున్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు రెండు మూడు సార్లు మాత్రమే స్పందించిన అవినాష్ రెడ్డి ఈసారి కాస్త ఘాటుగా స్పందించారు. వివేకా కేస్ లో ప్రధాన నిందితుడైన దస్తగిరికి వివేకా కుమార్తె సునీతకి లాలూచీ ఉండి ఉండొచ్చని అవినాష్ రెడ్డి ఆరోపించారు. సునీత తనపై కావాలని కుట్రలు పన్నుతోందని.. దీని వెనక టిడిపి అధినేత చంద్రబాబు హస్తం ఉందని ఆయన అన్నారు. వివేకా చివరి రోజుల్లో ఆయన కుమార్తె సునీత ఆయనకు నరకం చూపించిందని అవినాష్ రెడ్డి చెప్పారు. తను ఏ పాపము చేయలేదని.. న్యాయవ్యవస్థ పై తనకు నమ్మకం ఉందని.. నిజం నిలకడగా తెలుస్తుందని ఆయన అన్నారు.