కేసు నమోదు చేసిన వెంటనే.. రఘురామాను అరెస్టు చేయొద్దు
కేసుల నమోదులో పోలీసులు చట్టబద్ధ ప్రక్రియ అనుసరించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 4న ప్రధాని మోదీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకు తనకు రక్షణ కల్పించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన లంచ్మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిపింది. ఎంపీగా ఉన్నారు నియోజకవర్గానికి వెళ్ల వచ్చు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించగా.. పోలీసులు ఏదో ఒక కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని రఘురామ తరపున న్యాయవాది ఉమేశ్చంద్ర కోర్టుకు తెలిపారు. ఈ నెల 3, 4 తేదీల్లో కేసుపెడితే పోలీసులు చట్టబద్ద ప్రప్రకియ అనుసరించాలన్న హైకోర్టు కేసు నమోదు చేసిన వెంటనే అరెస్టు చేసేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది.
Tags :