ఆనంద్ మహీంద్రా కీలక ప్రకటన... మహీంద్రా యూనివర్సిటీకి
హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మహీంద్రా యూనివర్సిటీకి సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కీలక ప్రకటన చేశారు. ఈ విశ్వవిద్యాలయానికి రూ.500కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఐదేళ్లలో తమ కుటుంబం ఈ మొత్తాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీని అత్యుత్తమ కేంద్రంగా మార్చేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు పక్కన పెట్టనున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఈ యూనివర్సిటీ అనుబంధ విద్యా సంస్థ ఇందిరా మహీంద్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్కు మరో రూ.50 కోట్లు ఇస్తామని ప్రకటించారు.
Tags :