ఆయన ఓ అంతర్జాతీయ నిధి .. అమెరికా దౌత్యవేత్త ప్రశంస
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్పై భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ ప్రశంసలు కురిపించారు. ఆయన ఓ అంతర్జాతీయ నిధి అని కొనియాడారు. ఉత్తరాఖండ్లోని ఓ గ్రామం నుంచి వచ్చిన డోభాల్ భారత్కు ఒక నిధిలా ఎదిగారు. అంతేగాకుండా అంతర్జాతీయ సంపదగానూ మారారు అని ఎరిక్ వ్యాఖ్యానించారు. అమెరికా, భారత్ల మధ్య బలమైన బంధం ఉంది. భారతీయులు అమెరికన్లను, అమెరికన్లు భారతీయులను ప్రేమిస్తారని స్పష్టంగా తెలుస్తోంది అని పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్సియల్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన పురోగతి సాధిస్తోందని తెలిపారు. గ్రామంలోనే టీ విక్రేత కూడా ప్రభుత్వం నుంచి పొందుతున్న లబ్ధిని నేరుగా తన ఫోన్లోనే చూసుకుంటున్నారని తెలిపారు. డిజిటల్ ఇండియావల్ల ఇది సాధ్యమవుతోందని వెల్లడించారు.
Tags :