ఆదిపురుష్ రిలీజ్ ఉన్నట్లా? లేనట్లా?
ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ సినిమా అనగానే మొదట్లో ఫ్యాన్స్ చాలా ఎగ్జయిట్ అయ్యారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణంను భారీ రేంజ్లో వెండితెరపై చూపించబోతున్నట్లు చెప్పినప్పుడు ఈ ఎగ్జయిట్మెంట్ మరింత పెరిగింది. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చిన దానికి బజ్ ఓ రేంజ్ లో పెరుగుతూ వచ్చింది.
కానీ సినిమా టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అందరూ చాలా డిజప్పాయింట్ అయ్యారు. ప్రభాస్ ఫ్యాన్సే కాదు, సదరు సినీ అభిమానులు కూడా ఈ టీజర్ చూసి చాలా నిరాశ చెందారు. అన్ నేచురల్ గ్రాఫిక్స్, మెయిన్ క్యారెక్టర్ల వేషధారణ, మేకప్ ఈ నిరాశకు కారణమయ్యాయి. ఈ నెగిటివిటీ ఏ రేంజ్ కు చేరుకుందంటే మేకర్స్ గ్రాఫిక్స్, మేకప్ విషయంలో మళ్లీ వర్క్ చేయాలని డిసైడ్ అయ్యేంత.
దీంతో ఆదిపురుష్ 6 నెలల పాటు వాయిదా పడింది. జూన్ 16కు కొత్త రిలీజ్ డేట్ ను అప్పట్లోనే అనౌన్స్ చేసింది చిత్ర బృందం కానీ ఆ తేదీకి సినిమా వస్తుందా రాదా అనే డౌట్తోనే ఉన్నారు ఫ్యాన్స్. దీంతో ఈ సినిమా గురించి అందరూ మర్చిపోయారు. సరిగ్గా అదే టైమ్లో ఈ ఆదిపురుష్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. నిన్న నుంచి సినిమా రిలీజ్ కు సరిగ్గా 100 రోజులే టైమ్ ఉన్న నేపథ్యంలో కౌంట్డౌన్ ట్వీట్లతో ట్విట్టర్ ను హోరెత్తించి, ఆఖరికి ట్రెండ్ అయ్యేలా చేశారు ఫ్యాన్స్.
ఈ వందరోజుల కౌంట్డౌన్ పేరుతో ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా బాగానే ఉంది కానీ ఈ ట్రెండ్లో చిత్ర యూనిట్ నుంచి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయలేదు. దీంతో సినిమా చెప్పిన టైమ్ కు రిలీజ్ అవుతుందా లేదా అని ఫ్యాన్స్ కు సందేహాలు కలుగుతున్నాయి.