ఐటీ శాఖ హెచ్చరిక... అనుసంధానం మర్చిపోకండి
పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)ను ఆధార్తో అనుసంధానం చేసేందుకు వ్యవధి ఈ నెలాఖరుతో ముగుస్తుందని ఆదాయపు పన్ను విభాగం గుర్తు చేసింది. ఆదాయ పన్ను చట్టం-1961 ప్రకారం పాన్ ఉన్న ప్రతి వ్యక్తీ, దాన్ని ఆధార్తో జత చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికే పొడిగింపు ఇచ్చినందున, ఇందుకు రూ.1,000 అపరాధ రుసుము చెల్లించాలని పేర్కొంది. ఆదాయపు పన్ను పోర్టల్లో పాన్` ఆధార్ అను సంధానం చేసుకునేందుకు లింక్ ఉందని తెలిపింది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారు మరోసారి తనికీ చేసుకోవాలని సూచించింది.
Tags :