సీఎం కేసీఆర్ను కలిసిన ప్రముఖులు..
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్మేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, జెన్కోట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా హైస్కూల్ విద్యార్థులకు అందిచే మోడల్ డిక్షనరీని ముఖ్యమంత్రికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి అందజేశారు. అలాగే ఐనవోలు దేవాలయం, యాదాద్రి దేవాలయ క్యాలండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
Tags :