ఎన్టీఆర్ వైద్య సేవ లో భాగంగా తల్లి సురక్ష
అమరావతి: ‘తల్లి సురక్ష’ పథకాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
‘ఎన్టీఆర్ వైద్య సేవ’ లో భాగంగా ‘తల్లి సురక్ష’
దేశంలో తొలిసారి ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి వినూత్న పథకం
మాతా శిశు మరణాల రేటును తగ్గించి ఆరోగ్యవంత సమాజానికి బాటవేసేందుకు ’తల్లి సురక్ష‘
ఆస్పత్రిలో చేరిన గర్భిణికి పైసా ఖర్చు లేకుండా నగదు రహితంగా సురక్షిత కాన్పు
దారిద్ర్యరేఖ దిగువన ఉన్న రోగులకు ప్రభుత్వ, నెట్ వర్క్ ఆస్పత్రులలో 1044 రోగాలకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స
బయట ఆస్పత్రులలో సహజ ప్రసవానికి వ్యయం రూ.8000, సిజేరియన్ శస్త్రచికిత్స అయితే రూ.14,050
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులలో ప్రసవానికి చేరితే ‘తల్లి సురక్ష’ పథకం వర్తింపు
కాన్పునకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించే ‘తల్లి సురక్ష’ పథకం
ఏటా ఐదులక్షలమంది గర్భిణులకు తల్లి సురక్ష పథకంతో లబ్ది
అదనంగా రూ.500 కోట్ల వ్యయాన్ని భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం
2017-18లో ఆస్పత్రులలో సురక్షిత కాన్పుల సంఖ్య : 6,96,850 (ప్రభుత్వ ఆస్పత్రులలో 3,23,921 ప్రసవాలు
ప్రసవ సమయంలో తల్లుల మరణాలు(Maternal Mortality Rate..MMR) 2014-15లో 83
2018-19కి 65కు తగ్గిన తల్లుల మరణాలు
ప్రస్తుతం లక్షకు 65 గా ఉన్న తల్లుల మరణాల రేటు 50కి తగ్గించడం లక్ష్యం
ప్రభుత్వ ఆస్పత్రులో పడకల సంఖ్య తక్కువగా ఉన్నందున ప్రైవేటు ఆస్పత్రులలో ప్రసవానికి వెళ్లినా ఆదుకోవడానికి ‘తల్లి సురక్ష’
ఏపీ -108 మొబైల్ యాప్ ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఇంత చక్కని పథకాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు
అంతిమంగా సామాన్యుడికి మేలు జరగాలి
మనం పెట్టే వ్యయం కచ్చితంగా, సద్వినియోగపడేలా ఉండాలి
మాతా శిశు మరణాలను తగ్గించాలని నేనెప్పుడూ చెబుతుంటాను
ప్రసవానికి ముందు, ప్రసవం తరువాత తల్లులు మరణించకూడదు
ఐఎంఆర్, ఎంఎంఆర్ తగ్గించాలన్నది మన ధ్యేయం
అన్ని సేవలకు సర్వీసు ప్రొవైడర్లున్నారు
పథకాల అమలులో ప్రజల్లో సంతృప్తి రావాలి
అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న సమయంలో చేయాలి
డిపార్టుమెంటుకు చాలా మంచి పేరువచ్చింది
డిపార్టుమెంటును మన:స్ఫూర్తిగా అభినందిస్తున్నాను
మాతా శిశుమరణాల రేటు తగ్గుతుంది
ఒక సంకల్పం ఉంటే మంచి పనికి ఆటంకాలు లేవు
అన్ని ఏరియాల్లో వీధి దీపాలున్నాయి
విశాఖలో హుద్ హుద్ తుఫాను తర్వాత నాకు వినూత్న ఆలోచన వచ్చింది
అదే ఎల్ ఇ.డి బల్బుల ఏర్పాటు
మీరే పెట్టుబడి పెట్టి నిర్వహించండి అంటే వాళ్లు అంగీకరించారు
మనం ఒక్క పైసా ఖర్చు చేయకుండా రాష్ట్రమంతా ఎల్ ఈడీ బల్బులు పెట్టాం
కోట్లు ఆదా చేశాం
అమరావతి: ఆయుష్మాన్భవ పథకంలో భాగంగా కేంద్రం 60% భరిస్తుంటే, రాష్ట్రం 40% సమకూరుస్తున్నాం
రానున్న ఏప్రిల్ నుంచి ఆయుష్మాన్ తో సమంగా అందరికీ 5 లక్షల విలువైన చికిత్సలు
మీరు చెప్పిన పనులు చేస్తూనే టెక్నాలజీ ఉపయోగించి మెరుగైన ఫలితాలు రాబట్టబవచ్చు
మొబైల్ ఫోన్ ద్వారా పనులు
త్వరలో మొబైల్ సెల్ ఫోన్లు ఇస్తాం
నాణ్యమైన గాలి అందేలా వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తున్నాం
స్వచ్ఛమైన పోషకాలతో కూడిన ఆహారం అందిస్తున్నాం
కార్బన్ డయాక్సైడ్ లేకుండా అంతా ఆక్సిజన్ తో కూడిన స్వచ్ఛమైన గాలి అందేలా పర్యావరణం
ఆనందంగా పనిచేయాలి
డిపార్టుమెంట్ ఉద్యోగులకు అందరికీ అభినందనలు
2019 అందరికీ శుభాలు చేకూర్చాలి