తెలంగాణలో మోగిన పంచాయతీ నగారా
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు విడుతలుగా జనవరి 21, 25, 29 తేదీల్లో పోలింగ్ను నిర్వహించనున్నారు. ఈ నెల 7, 11, 16 తేదీల్లో ఆయా ప్రాంతాల రిటర్నింగ్ అధికారులు ఇచ్చే నోటీసులతో నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. పోలింగ్ ముగిసిన రోజునే ఫలితాలను వెల్లడించి, చేత్తులెత్తే పద్ధతిలో ఉప సర్పంచి ఎన్నికలను సైతం పూర్తి చేస్తారు. ఎన్నికల ప్రక్రియను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) నోటిఫికేషన్ వెలువరించింది.
Tags :