మూర్ఛకు బ్రెయిన్ పేస్ మేకర్ !
మూర్చ, పార్కిన్సన్స్తో బాధపడే రోగుల కోసం బ్రెయిన్ పేస్మేకర్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వైరలెస్గా పనిచేసే ఈ పరికరం తనలోని విద్యుత్ శక్తితో మెదడును చైతన్యంగా ఉంచడంతోపాటు, చికిత్సకు మెరుగ్గా ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ పేస్మేకర్ను వాండ్ అనే పేరు పెట్టారు. మెదడు పనితీరులో ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే అక్కడ సమస్యను సరిదిద్దేందుకు ఇది ఉపకరిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనా వివరాలను నేచరల్ బయెమెడికల్ ఇంజనీరింగ్ అనే జర్నల్లో ప్రచురించారు. ఇందులోని 128 చానల్స్ ద్వారా మెదడు పనితీరును గ్రహిస్తుందని తెలిపారు.
Tags :