అంతర్జాతీయ విమానాలపై మరోసారి ఆంక్షలు
అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను కేంద్రం మరోసారి పొడిగించింది. జూన్ 6న ఇచ్చిన ఆదేశాలను జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) తెలిపింది. జనవరి 31 వరకు అన్ని అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని సృష్టం చేసింది. నిర్దేశించిన మార్గాల్లోనే అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతిస్తున్నట్టు డీజీసీఏ జారీచేసిన సర్క్యులర్లో పేర్కొంది. కార్గో విమాన సేవల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని సృష్టం చేసింది.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులపై తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, వందేభారత్ మిషన్ కింద మే నుంచి ప్రత్యేక విమనాలను డీజీసీఏ నడిపింది. ఆ తర్వాత అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 24 దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా జూలై నుంచి ఎంపిక చేసిన రూట్లలో ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతున్నారు.