జగన్కు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పలువురు ప్రజా ప్రతినిధులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చి జగన్మోహన్రెడ్డి ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags :