ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం

అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం

విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు సంబంధించిన 14 వాహనాలను, వీటితో పాటు అత్యవసర పోలీస్‍ సేవల కోసం మరో 36 వాహనాలను ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‍ కార్యక్రమం ద్వారా వీటిని ప్రారంభించారు. ఎటువంటి విపత్తు జరిగినా అన్ని ఉపకరణాలు ఉండేలా.. 20 మంది ఎస్డీఆర్‍ఎఫ్‍ టీం వెళ్లేలా విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు చెందిన 14 వాహనాలు రూపుదిద్దుకున్నాయి. అత్యాధునిక వీడియో కెమెరాలతో సెంట్రల్‍ కమాండ్‍ రూమ్‍కి ఇవి కనెక్ట్ కానున్నాయి. వీటి ద్వారా ఫీల్డ్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి పోలీస్‍ శాఖ సత్వర నిర్ణయాలు తీసుకోనుంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :