ASBL NSL Infratech

టీటీఏ మెగా కన్వెన్షన్‌... ప్రముఖులకు ఆహ్వానం

టీటీఏ మెగా కన్వెన్షన్‌... ప్రముఖులకు ఆహ్వానం

సియాటెల్‌లో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా పలువురు ప్రముఖులను ఇండియాకు వచ్చిన టిటిఎ ప్రతినిధులు స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. టీటీఏ ప్రెసిడెంట్‌ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ నవీన్‌ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్‌ రీజనల్‌ అడ్వైజర్స్‌ డాక్టర్‌ ద్వారకానాథ రెడ్డి, నవీన్‌ గోలి, సీఈసీ ఈవీపీ డాక్టర్‌ ఎల్‌ఎన్‌ రెడ్డి దొంతిరెడ్డితోపాటు ఈసీ, బీవోడీ జ్యోతి రెడ్డి దూదిపాల, బీవోడీ దుర్గాప్రసాద్‌ సెలోజ్‌ తదితరులు కలిసి టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. తొలుత తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ) ప్రతినిధులు కలిశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా సేవలందించిన ఆయన్ను వారు కన్వెన్షన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. 

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిని టిటిఎ ప్రతినిధులు కలిసి మెగా కన్వెన్షన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని కూడా టిటిఎ నాయకులు కలిసి కన్వెన్షన్‌ ఆహ్వానపత్రాన్ని అందజేశారు. సినీనటుడు నితిన్‌ను, ప్రముఖ నిర్మాత దిల్ రాజును టిటిఎ నాయకులు కలిశారు. టిటిఎ మెగా కన్వెన్షన్‌కు ఆహ్వానించారు. మే నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు టీటీఏ మెగా కన్వెన్షన్‌ జరగనుంది. సియాటెల్‌లో జరగనున్న ఈ వేడుకల్లో పాల్గొనాలని అనుకునే వారు ఈ వేడుకల్లో ఎన్నో ఉత్సాహవంతమైన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

 

Click here for Photogallery

 

 

Tags :