ASBL NSL Infratech

డిసెంబర్ 18న తానా అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన

డిసెంబర్ 18న తానా అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన

తానా ఆధ్వర్యంలో డిసెంబర్ 18న పది లక్షల మంది విద్యార్థులతో అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన నిర్వహిస్తున్నారు. అమృతమూర్తి అయిన అమ్మ గురించి, త్యాగమూర్తి అయిన నాన్న గురించి, ఆదర్శమూర్తి అయిన గురువు గురించి, పద్యాలు పాడటం కంటే మరోభాగ్యం, మహాభాగ్యం ఇంకా ఏముంటుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మరియు 100 దేశాల లోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో శత శతక కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ ఆఫ్రికా టు అమెరికా అంటూ ‘వందే విశ్వమాతరమ్‘ పేరుతో 100 దేశాలలో శాంతి, సద్భావనా యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రపంచ సాహిత్య చరిత్రలో అపూర్వమైన ఘట్టంగా చెప్పదగిన ఈ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చైతన్య యాత్రలో భాగంగా అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా పూర్వ అధ్యక్షులు, వందే విశ్వమాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్లూరి తెలిపారు.

చిగురుమళ్ళ శ్రీనివాస్ రచించిన అమ్మ శతకం, నాన్న శతకం, గురువు శతకాలలోని పద్యాలు పిల్లలతో కంఠస్థం చేయించి, డిసెంబర్ 18న ఎవరి విద్యా సంస్థల్లో వారు ఉదయం 9 గంటలకు సామూహిక పద్య గానం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాల ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అని వారు వెల్లడించారు.

 

 

Tags :