ASBL NSL Infratech

అలరించిన నాటా సాహిత్య కార్యక్రమాలు

అలరించిన నాటా సాహిత్య కార్యక్రమాలు

నాటా 2023 సభల్లో రెండో రోజు శనివారం కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాహిత్య వేదిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. జానపదం, నాటకం పేరిట నిర్వహించిన ఈ వేదికలో మాడిశెట్టి గోపాల్‌, మాట్ల తిరుపతి జానపద గేయాలు, మీగడ రామలింగస్వామి ఏకపాత్రాభినయం, వాడ్రేవు సుందర్రావు చేసిన ఏకపాత్రాభినయాలు ఆకట్టుకున్నాయి. వేదిక అధ్యక్షుడు డా.యు.నరసింహ రెడ్డి, ఉపాధ్యక్షుడు అనంత్‌ మల్లవరపు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ రోజు కార్యక్రమంలో డా.తోటకూర ప్రసాద్‌, సుబ్బు జొన్నలగడ్డ, శారద సింగిరెడ్డి, చంద్రహాస్‌ మద్దుకూరి, చంద్ర కన్నెగంటి, వంగూరి చిట్టెన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags :