ASBL NSL Infratech

ఘనంగా ముగిసిన నాటా మహాసభలు

ఘనంగా ముగిసిన నాటా మహాసభలు

డల్లాస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) 2023 మహాసభలు వైభవంగా ముగిశాయి. డల్లాస్‌ నగరంలోని కే బేలీ కన్వెన్షన్‌ సెంటరులో జూన్‌ 30 నుంచి జూలై 2 వరకు వైభవంగా జరిగిన నాటా మహాసభలు జనసందోహంతో, విభిన్న కార్యక్రమాల నడుమ ముగిసింది. ముగింపు రోజైన ఆదివారం నాడు దాదాపు 15వేల పైచిలుకు అతిథులు మహాసభకు హాజరయ్యారు. దీంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మూడురోజులకు కలిపి 25వేలకు పైగా అతిథులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని నిర్వాకులు తెలిపారు.

నాటా జీవిత సాఫల్య పురస్కారాన్ని సంస్థ వ్యవస్థాపకుడు, ప్రముఖ వైద్యుడు డా.ప్రేమ్‌సాగర్‌ రెడ్డికి ప్రస్తుత అధ్యక్షుడు డా.కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం అందజేసి ఘనంగా సత్కరించింది. ముగింపు వేడుకల్లో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ సంగీత విభావరి ఉర్రూతలూగించింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి దంపతులను ఈ సందర్భంగా సత్కరించారు. నవీన్‌ హాస్యనాటిక అందరినీ ఆకట్టుకుంది. తనకు, తన బృందానికి నాటా ద్వారా సేవ చేసే అవకాశాన్ని కల్పించి ఈ వేడుకలను విజయవంతం చేసిన వారికి అధ్యక్షుడు డా.కొర్సపాటి శ్రీధర్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శ్రీధర్‌ రెడ్డి దంపతులను నాటా కార్యవర్గం సత్కరించింది.

 

Click here for Event Gallery

 

 

Tags :