చండీయాగంలో గవర్నర్ ప్రత్యేక పూజలు
మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తోన్న ఆయుత మహా చండీయాగంకు వీఐపీల తాకిడి పెరిగింది. పలువురు యాగస్థలికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. 4వ రోజున గవర్నర్ నరసింహ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ దంపతులు యాగశాల బయట అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి తరించారు. ఈ సందర్భంగా ఇరువురు చండీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. చండీయాగం తొలిరోజు కూడా గవర్నర్ నరసింహన్ దంపతులు పూజులు నిర్వహించారు.
Tags :