ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

చండీయాగాన్ని అద్భుతంగా నిర్వహించారు

చండీయాగాన్ని అద్భుతంగా నిర్వహించారు

దేశ ప్రధాని నరేంద్రమోడీతో సాధ్యం కాని పని లోక కళ్యాణార్ధం దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమైందని అమ్మవారి పాదాల సాక్షిగా చెబుతున్నా తెలంగాణకు అరిష్టం కాదు శుభసూచకమే అని విశాఖ శారద పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపనందేంద్రస్వామీజీ అన్నారు. అయుత చండీ మహాయాగం ముగింపు రోజు కార్యక్రమంలో పాల్గొన్న అయన అక్కడ జరిగిన అగ్నిప్రమాదంపై స్పందించారు. అయుత చండీ మహాయాగం దేశంలోనే అత్యద్భుతమైన గొప్పదని అన్నారు. తెలంగాణలో అన్ని రకాలుగా సుభిక్షంగా వుండాలనే సదుద్దేశ్యంతో తలపెట్టిన ఈ యాగం తెలంగాణకు అన్ని రకాలుగా శుభసూచకమన్నారు. మత రాజకీయాలకు పాల్పడే ఏ రాజకీయ నాయకులు, ఏ పార్టీలు చేయలేనంత సాహసం చేసి లోకమంతా సుభిక్షంగా, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వుండాలనే ధృడసంకల్పంతో ఈ చండీయాగం నిర్వహించడం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. చండీ అమ్మవారికి పరమ రుద్రుడు తోడై ఈ ప్రమాదం జరిగిందే తప్ప దీనిలో తప్పేమీ లేదన్నారు. అయుత చండీమాతకు పూర్ణాహుతి కార్యక్రమం జరగాల్సివుండగా ఉదకశాంతితో ముగించాల్సిన ఈ యాగంలో జరిగిన మంటలు పూర్ణాహుతికి కిందకే వస్తాయన్నారు. 

Tags :