ASBL NSL Infratech

హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్ ఏర్పాటు చేయనున్న 'కాల్‌ అవే' గోల్ఫ్‌ కంపెనీ

హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్ ఏర్పాటు చేయనున్న 'కాల్‌ అవే' గోల్ఫ్‌ కంపెనీ

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కాల్‌అవే గోల్ఫ్‌ కంపెనీ హైదరాబాద్‌లో డిజిటెక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌తో ఆ కంపెనీ ప్రముఖులు ఈ విషయమై చర్చలు జరిపారు. అనంతరం ఈ ప్రకటనను విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేయనున్న డిజిటెక్‌ సెంటర్‌లో 300 మంది సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌కు ఉపాధి లభించనుంది. ఈ కేంద్రం డేటా అనలిటిక్స్‌తోపాటు ఆ కంపెనీ గ్లోబల్‌ ఆపరేషన్స్‌కు ఐటీ బ్యాకెండ్‌ సపోర్ట్‌ను అందించనుంది. కాగా, ఈ సమావేశంలో తెలంగాణలో స్పోర్ట్స్‌ టూరిజం, తయారీలాంటి ఇతర సహకార అవకాశాలపై చర్చించారు. డిజిటెక్‌ సెంటర్‌ ఏర్పాటుకోసం దేశంలోని వివిధ నగరాలను పరిశీలించిన కాల్‌అవే కంపెనీ, చివరగా హైదరాబాద్‌ను ఎంచుకోవడం విశేషం.

 

Tags :