ASBL NSL Infratech

ఒంటిరాగానే పోటీ ...ఎవరితోనూ పొత్తులుండవు

ఒంటిరాగానే పోటీ ...ఎవరితోనూ పొత్తులుండవు

తెలంగాణలో బీజేపీ ఒంటిరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తులుండవని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సృష్టం చేశారు. హైదరాబాద్‌కు వచ్చిన అమిత్‌షా పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబం కోసమే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. 2014లో తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రి చెస్తానని ఇచ్చిన హామీని విస్మరించారని దుయ్యబట్టారు. కనీసం 2018లోనైనా దళితున్ని సీఎంగా నియమిస్తారో లేదో సృష్టంగా చెప్పాలన్నారు. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం అని సృష్టం చేశారు. కేసీఆర్‌ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఎంఐఎం చెప్పిన మాట కేసీఆర్‌ తూచా తప్పకుండా పాటిస్తోందని ఆరోపించారు. తెలంగాణను మళ్లీ రజాకార్ల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ అవకాశవాద రాజకీయాలే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు.

బీజేపీ ప్రభుత్వం హయాంలో దేశంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని, ఆయా రాష్ట్రాల ఏర్పాటు తర్వాత రాష్ట్రాలన్నీ కలిసి అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పూర్తివిరుద్ధంగా జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సీఎం అంజయ్య, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పట్ల ఎలా వ్యవహరించిందో తెలుగు ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఇదే సమయంలో తాము వాజ్‌పేయి పట్ల ఎంత గౌరవంగా వ్యవహరించామో ప్రజలందరూ చూశారన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉందన్నారు.

 

Tags :