ASBL NSL Infratech

బాలకృష్ణను కలిసిన ఆటా నాయకులు... మహాసభలకు ఆహ్వానం

బాలకృష్ణను కలిసిన ఆటా నాయకులు... మహాసభలకు ఆహ్వానం

అట్లాంటాలో జూన్‌ 7,8,9 తేదీల్లో జరగనున్న అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాల్సిందిగా టాలీవుడ్‌ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణను ఆటా నాయకులు ఆహ్వానించారు. రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ ఆటా మహాసభలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించేందుకు ఆటా నాయకులు ఇండియా వచ్చారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను స్వయంగా కలిసి ఆటా మహాసభల ఆహ్వానపత్రాలను అందిస్తున్నారు. నందమూరి బాలకృష్ణను కూడా కలిసి మహాసభలకు రావాల్సిందిగా కోరారు. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ కిరణ్‌ పాశం, మాజీ ప్రెసిడెంట్‌ కరుణాకర్‌ ఆసిరెడ్డి, కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ తిరుపతి, అడ్వైజర్‌ గౌతం గోలి, డైరెక్టర్‌ అనీల్‌ బొద్దిరెడ్డి, ఆటా నాయకులు సన్నీరెడ్డి, కల్చరల్‌ ఛైర్‌ నీలిమ గడ్డమణుగు, కోడైరెక్టర్‌ శ్రీనివాస్‌ శ్రీరామ మరియు పొలిటికల్‌ ఛైర్‌ రమణ బత్తుల తదితరులు సినీనటులను కలిసిన వారిలో ఉన్నారు.

 

 

 

 

Tags :