వైసీపీకి మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీకి మరో షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆ పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో టికెట్ను ఆయన స్థానంలో విప్పర్తి వేణుగోపాల్కు వైసీపీ కేటాయించింది. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న చిట్టిబాబు నేడు పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో పీసీసీ అద్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Tags :