సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు హైదరాబాద్లోని గాంధీభవన్లో సమన్లు జారీ చేసి, మే 1న విచారణకు హాజరు కావాలని కోరారు. ఫోన్ తీసుకొని విచారణకు రావాలని సమన్లలో పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరలవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Tags :