కేంద్రమంత్రి అమిత్ షా కు త్రుటిలో తప్పిన ప్రమాదం
కేంద్ర హోమంత్రి అమిత్ షా కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొంతసేపు నియంత్రణ కోల్పోయింది. బిహార్ లోని బెగుసరయ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బెగుసరయ్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా ప్రచారం ముగించుకుని హెలికాప్టర్లో బయల్దేరారు. అయితే టేకాఫ్ అవుతుండగా అది నియంత్రణ కోల్పోయి కుడివైపు దిశగా ఊగిసలాడిరది. ఒక దశలో నేలను తాకబోయింది. అప్రమత్తమైన ఫైలట్ వెంటనే హెలికాప్టర్ను కంట్రోల్లోకి తీసుకోవడంతో అతి నిర్ణీత మార్గంలో బయల్దేరింది.
Tags :