జగన్ కోసం మేము సిద్ధం అంటున్న వాలంటీర్లు..
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వాలంటీర్ వ్యవస్థ పై ప్రతిపక్షాలు పలు రకాల ప్రశ్నలు రేకెత్తించాయి. దీంతో ఎన్నికల సంఘం కూడా డబ్బు పంపిణీ విషయానికి వాలంటీర్ వ్యవస్థను దూరంగా ఉంచాలి అని నిర్ణయం తీసుకున్నారు.. ఇంటి వద్దకే వచ్చి అందుతున్న పెన్షన్ వంటి స్కీమ్స్ తో ప్రజలకు బాగా దగ్గరైన వాలంటీర్లు జగన్ తరుపున ప్రచారం చేస్తారేమో అన్న భయంతో ప్రతిపక్షాలన్నీ కలిసి ఇటువంటి పనికి పాల్పడ్డాయి. అయితే న్యాయబద్ధంగా పనిచేస్తున్న తమపై వచ్చిన ఆరోపణలు కొందరు వాలంటీర్లు తట్టుకోలేకపోతున్నారు. అందుకే వారు తమ పదవికి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు వారంటీర్లు తమ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా 800 మంది గ్రామ వార్డు వాలంటీర్లు రాజీనామా చేయడం వైరల్ గా మారింది. అంతేకాదు వారందరూ మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సమక్షంలో ఒకటిగా చేరి జగన్ కోసం తామంతా సిద్ధం అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఆంధ్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది.