కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. వంశా తిలక్ను ఎంపిక చేస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. 2024లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. మే 13న లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.
Tags :