ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టీడీపీ గెలుపు కోసం పనిచేసేందుకు ఎన్ఆర్ఐలు సిద్ధం

టీడీపీ గెలుపు కోసం పనిచేసేందుకు ఎన్ఆర్ఐలు సిద్ధం

ఎన్‌ఆర్‌ఐలు తెలుగుదేశం పార్టీకి బ్రాండ్‌ అంబాసిడర్లు అని తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్‌ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఎన్‌రీచ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో బూత్‌స్థాయిలో పని చేస్తామని 1500 ఎన్‌ఆర్‌ఐలు ముందుకు వచ్చి రిజిస్టర్‌ చేయించుకన్నారన్నారు. ఈ సందర్భంగా టీడీ జనార్ధన్‌ మాట్లాడుతూ బ్రిటీష్‌ పాలకుల కంటే నిరంకుశంగా సీఎం జగన్‌ పాలిస్తున్నారని, ఆయనను గద్దెదించి ప్రజలకు స్వేచ్ఛ రావాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అశోక్‌ బాబు మాట్లాడుతూ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ప్రభావితం చేసేలా ఎన్‌ఆర్‌ఐలు పనిచేయాలని సూచించారు. ఎన్డీఏ బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ చంద్రబాబు విజన్‌కు హైదరాబాద్‌ నిదర్శమని, ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పదేళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని అన్నారు.

టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసేందుకు ఎన్‌ఆర్‌ఐలు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ కమిటీల్లో ఎన్‌ఆర్‌ఐలకు అవకాశాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కో ఆర్డినేటర్‌ కోమటి జయరాం, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ గల్ఫ్‌ కో ఆర్డినేషన్‌ కమిటి అధ్యక్షులు రాధాకృష్ణ, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్‌, పలువురు ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :