ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం
ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా స్నేహ మెహ్రాను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే, అదే స్థానంలో విధులు నిర్వర్తించిన డీసీపీ సాయి చైతన్యను బదిలీ చేసి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ముగ్గురి పేర్లను సీఎస్ శాంతికుమారి ఈసీకీ పంపింది. మొత్తం ముగ్గురు పేర్లను పరిశీలించిన ఈసీ చివరకు స్నేహ మెహ్రాను హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఇచ్చిన బాధ్యతలను వెంటనే స్వీకరించాలని ఈసీ ఆదేశించింది.
Tags :