క్రేజీ కాంబో సెట్ చేసుకున్న ధ్రువ్ విక్రమ్
చేసింది రెండు సినిమాలే అయినా విక్రమ్ కొడుకు ధ్రువ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో హీరోగా పరిచయమైన ధ్రువ్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. రెండో సినిమా మహాన్ లో తన తండ్రి విక్రమ్ తో స్క్రీన్ షేర్ చేసుకుని అతనికి పోటీగా నటించి మంచి మార్కులే కొట్టేశాడు. మహాన్ లో ధ్రువ్ యాక్టింగ్ కు అందరూ ఇంప్రెస్ అయ్యారు.
ఆ సినిమా తర్వాత ధ్రువ్ వరుస పెట్టి సినిమాలు చేస్తాడనుకున్నారంతా. కానీ ధ్రువ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేయడానికి ఇంత కాలం పట్టింది. తన మూడో సినిమాను క్రేజీగా సెట్ చేసుకున్నాడు. మొదటి సినిమా పరియేరుం పెరుమాల్ తో నేషనల్ అవార్డు అందుకున్న మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ తన తర్వాతి సినిమాను చేయబోతున్నాడు.
ఈ సినిమాను పా. రంజిత్ నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇందులో సౌత్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ధ్రువ్ కు అనుపమ మంచి జోడీ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మారి సెల్వరాజ్ మరోసారి బలమైన కాన్సెప్ట్ తో రాబోతున్నాడని ప్రీ లుక్ పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. మరి ఈ సినిమా ధ్రువ్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.