ASBL NSL Infratech

వారి సమాచారం అందించిన వారికి రూ. 20 లక్షల రివార్డు : ఐఏఎఫ్

వారి సమాచారం అందించిన వారికి రూ. 20 లక్షల రివార్డు : ఐఏఎఫ్

జమ్ము కశ్మీర్‌లోని పూంచ్‌లో భారత వైమానిక (ఐఏఎఫ్‌ ) దళం వాహనంపై దాడి చేసిన ఇద్దరు పాకిస్థాన్‌ ఉగ్రవాదుల స్కెచ్‌లను భద్రతా దళాలు విడుదల చేశాయి. వీరి అరెస్ట్‌ కోసం సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించాయి. పూంచ్‌లోని షాసితార్‌ సమీపంలో ఐఏఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆకస్మిక దాడిలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) కార్పొరల్‌ విక్కీ పహాడే మరణించగా మరో నలుగురు సిబ్బంది గాయపడ్డారు.  కాగా, ఉద్రవాదుల దాడి అనంతరం భద్రతా బలగాలు షాసితార్‌ ప్రాంతంలో భారీగా సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. సాయుధ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు, డాగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలను ముమ్మరం చేశారు. దాడి చేసిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. చాలా మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :