భద్రాచలం సీతమ్మకు కానుక త్రీడీ చీర
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రూపొందించారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న దీని బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరువు వర్ణాలతో తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందుకు రూ.48 వేలు ఖర్చు అయిందని, రంగులు మార్చే ఈ చీరను ఈ నెల 16న భద్రాచలం సీతమ్మకు కానుగా అందించనున్నట్లు వెల్లడించారు.
Tags :